papa vimochani yekadasi vratha katha in telgu lyrics .పాప విమోచని ఏకాదశి వ్రత కథ

శ్రీ శ్రీ గురు గౌరాంగౌ జయతః
ఏకాదశి వ్రత మహత్యము
‘విష్ణుమాసము ‘
(చైత్ర బహుళ ‘పాపవిమోచని’ ఏకాదశి )
(1)
భవిష్యోత్తర పురాణములోని శ్రీ కృష్ణ యుధిష్ఠిర సంవాదము :
1.మహారాజు యుధిష్ఠిరుడు భగవంతుడు అయిన శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను . ‘ఓ ప్రభో ! చైత్ర బహుళ మాసములో ఏకాదశి కి ఏ పేరుతో ప్రపంచములో ప్రసిద్ధి చెందినది’ ? దానికి ఎట్టి ఫలితములు కలవు . యధా ప్రకారముగా నాకు చెప్పమని ప్రార్ధింపగా భగవానుడు శ్రీకృష్ణుడు ఇట్లు పలుకుతున్నారు .’ఓ మహారాజా ! ప్రాచిన కాలములో మాంధాత మహారాజు ‘రోమశ ‘
ఋషీశ్వరుని యి ప్రశ్న అడిగెను . అప్పుడు ఋషీశ్వరుడు దానికేమి సమాధానము చెప్పెనో నేను కూడా దానినే చెప్పుతున్నాను .
ఏకాదశి వ్రత మహత్యము
ఈ వ్రతమాచరించిన జీవులు సర్వ పాపములు నశించిపోయి పైశాచత్వము నుండి కూడ విమోచనము కలిగి బహువిధ శుభవిధ ఫలితములు కలుగును. పూర్వ కాలములో ధనపతి అగు కుభేరునికి ‘చిత్రరధ’ అను పేరు గల ఒక సుందరమయిన తోట కలదు .
2.అక్కడ నిత్యవసంత ఋతువులో అలరారుచుండేడి
ఆ వనములో కుభేరుడు నివసించేవాడు. బహువిధ గీత వాద్యములతో గంధర్వ కాంతల తోను మరియు కిన్నెరా పురుషులతోను ఆనందోపభోగము , దేవదేవిల సాంగత్యము తో దేవరాజైన ఇంద్రుడు ఆ పుష్పోధ్యానములో క్రీడించేడివాడు. అక్కడ అసంఖ్య సంవత్సరముల నుండి సాధువులు తపస్యాచరణము
చేసెడివారు.
ఏకాదశి వ్రత మహత్యము
3.ఆ ఉద్యనములో ‘మేధావి’ అను ఒక బ్రహ్మచారి ఋషి కూడా తపస్సు చేసెడి వారు. అట్టి ఆ ఋషి తపోభంగము కొరకు ‘మంజుఘోష’ అను ఒక అప్సర ఆ తోటకు రెండు మైళ్ళ దూరముగా వుంది ఋషి అభిశాప భయంతో దగ్గరకు వెళ్ళకుండ,తమ ఇంటికి సన్నిహిత వీణా వాద్యముతో సుమదురమయిన కంఠముతోగానము చేయుచుండేది. ఒకానొక రోజు ఆ మంజుఘోష గంధము, చందనము,పుష్ప మాలలతో అలంకారములు ధరించి కామానలముతో ప్రపీడితయై మువ్వలతో నృత్యం చేయుచు సులలితమయిన అంగభంగిమలతోను, అనుపమ రూపలావణ్యముల తోను ఆశ్రమములోని మేధావి ఋషితో “నేను మీయొక్క రూపసౌందర్యము చూసి ఎంతో ముగ్దురాలు అయితిని” అని పలికెను. అట్లే మేధావి ఋషి కూడా మంజుఘోష రూపలావణ్యమును చూచి ఆకర్షితుడై ఆమెను చూస్తుండగా, ఆ మంజుఘోష తన హస్తము నందలి వీణ ప్రక్కన పెట్టి అతనిని ఆలింగనము చేసుకుంది. ఇద్దరు కామ వికారముతో యాబది ఆరు సంవత్సరములు సంసరసాగారములో మునిగిపోయారు. ఇట్లుండ ఒకనాడు మంజుఘోష
మేధావి ఋషి తో నేను దేవలోకమునకు వెళ్ళుచున్నాను.
ఏకాదశి వ్రత మహత్యము
4.అని పలుకగా విని ఋషి ఇంకను తెల్లవారు జాము కాలేదు కదా! తరువాత వెళ్ళవచ్చు నని చెప్పెను. పిమ్మట మంజుఘోష నేను ఎన్ని సంవత్సరముల నుండి ఇక్కడ వున్తున్ననో గణించి చెప్పండని పలుకగా, మేధావి ఋషి ఒక పర్యాయము గడచినా కాలము చూసి 56 సo .. గడచినవి అని పలికిరి . ‘ఓ పాపాత్మురాలా! దుష్టమార్గముతో,అధర్మముతో కులటవలే ఉన్నందున నీవు పైశాచిక జన్మపొందుమణి శపించెను. అప్పుడు వెంటనే పిశాచ జన్మ పొందిన మంజుఘోష మేధావి ఋషిని ప్రాయచ్చిత్వము తెలుపమని పరిపరివిదముల ప్రాధించెను. ‘సుందరి! నీతో నేను చాలా సంవత్సరములు సంసారము చేయుటచే నా తపస్సు అంతా వ్యర్ధమయినది.అయినప్పటికిని నీకు కొన్ని సడుపదేశములు చెప్పవలెనని అనుకోనుచుంటిని. వినుము చైత్ర బహుళ ఏకాదశి వ్రథ్ ఉపవాసముతో శ్రీ భగవంతుని నామస్మరణ చేసినచో నీ పిశాచ జన్మము నుండి విముక్తి కలుగునని చెప్పి ఋషి అగు మేధావి తన తండ్రియైనా చ్యవన మహర్షి వద్దకు వచ్చెను. త దుష్కృత్యమునకు ప్రాయశ్చిత్తం మును తెలుపమని కోరగా మిక్కిలి దుక్కితుడై పుత్రుడు మేధావితో ఇట్లనెను. ‘ ఓ వత్సా! నీవు ఎత్తి దుష్కర్మము చేసినవో దానికి ప్రాయశ్చిత్తంగా చైత్ర మాసములో బహుళ ఏకాదశి అనునొక పాపవిమోచని ఏకాదశి తిధిలో ఉపవాసము చేయవలెను. అనగా ఆవిధముగా చైత్ర బహుళ ఏకాదశి ఉపవాసము హరినామస్మరణము తో పూర్తి చేయవలెను. ఆ వ్రత మహత్యము వలన మేధావి ఋషి మరల పుర్వతపశక్తిని పొంది తపోధన్యుడు అయ్యేను.
5.అదే విధముగా మేధావి ఋషి ఉపదేశాన్ని పొందిన పైశాచిక రూపములో వున్నా మంజుఘోష చైత్ర బహుళ ఏకాదశి వ్రతము ఆచరించి పిశాచ రుపమునుండి విముక్తి పొంది దేవా లోకమునకు దివ్య శరీరముతో వెళ్ళెను. అని మంధాతకు రోమశముని చైత్ర బహుళ ఏకాదశి వ్రత విశిష్ట తను తెలియబరచెను.
6.శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుడుని తో ఇట్లు చెప్పసాగెను .ఓ మహారాజా ! పాపవిమోచని ఏకాదశి ఆచరించిన వారికి ప్ర్వజన్మ పాపములు, ఈ జన్మములోని పాపములు నశించును. ఈ వ్రత కథను శ్రవణ,కీర్తన,మననము చేసిన వారు కూడా చోరకృత్యము,సురాపానము వంటి అనేక దోషముల నుండి విముక్తి పొందిన వారై భగవద్దమమునకు వెళ్ళెదరు.
ఏకాదశి వ్రత కథ సమాప్తము
ఓం నమో భగవతే నారాయణాయ
Comments
Post a Comment
thanks for your comment