నలదమయంతుల కథ .Nala Damayanthula kada in telugu lyrics


నలదమయంతుల  కధ

కలియుగములో ధర్మమూ  తక్కువగా వుంటుంది ..అందు చేత పాపములు పోవాలి అంటే మనము
నలదమయంతుల కథ ను వింటే పాపాలు పోతాయి.
ఒకరోజు  బృహదశ్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు.ధర్మరాజు ఆ మునికి అతిధి సత్కారాలు
కావించి కౌరవుల వలన తాము పడుతున్న బాధలు అన్ని వివరించి "మహాత్మా! రాజ్యాని , నివాసాన్నిపోగొట్టుకొని
మాలాగ అడవిలో కష్టాలు పడుతున్నావారు ఎవరయినా వున్నారా? వుంటే చెప్పండి"  అని అడిగాడు.
అందుకు బృహదశ్వుడు "ధర్మరాజా ! నీవు కష్టాలు  పడుతూ అడవులలో వున్నా, నీ వెంట  నీ అన్నదమ్ములు,
నీ భార్య ,నీ హితం కోరే విప్రులు నీ వెంట  ఉన్నారు.
పూర్వము నలుడు అనే మహారాజు  నీవలె జూదములో సర్వము కోల్పోయి,పుష్కరునికి రాజ్యాని అప్పగించి భార్య సమేతుడై వొంటరిగా  అరణ్యాలకు వెళ్ళాడు ", అని చెప్పాడు.
అది  విని ధర్మరాజు "మహాత్మా! నాకు నలుని కథ వివరించండి ." అని అడిగాడు.
బృహదశ్వ్హుడు ధర్మరాజు కు ఇలా వివరించ సాగాడు ."నిషిధదేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు.తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా  పరిపాలిస్తున్నాడు.
చాలా కాలం అతనికి సంతానం లేదు.  అతనికి దమనుడు అనే ముని ఇచ్చిన వారము వలన దమయంతి  అనే కూతురు , దముడు ,దమనుడు,దాoతుడు  అనే కుమారులు కలిగారు.  దమయంతి సౌoదర్య రాశి,గుణవంతురాలు
దమయంతి నలుని గుణగణాలను గురించి విన్నది, నలుడు దమయంతి గురించి, ఆమె  సౌoదర్యం గురించి  విన్నాడు.
ఇరువురి    నడుమ ప్రేమ   అంకురించింది.
నలదమయంతుల మధ్య హంస రాయబారం.....
ఒక రోజు  నలుడు ఉద్యాన వనంలో  వుండగా హంసలగుంపు వచ్చి  అక్కడ వాలింది . ఆ హంసలను చూసి ముచ్చట
పడి  నలుడు  వాటిలో ఒకదానిని పట్టుకున్నాడు .మిగిలిన  హంసలు తోటి హంసలను విడిచి వెళ్ళలేక ఆకాశంలో తిరుగుతున్నాయి . నలునితో అతని చేతి లో హంస  మానవ భాష లో  ఇలా అన్నది."ఓ మహారాజా !నేను దమయంతి వద్దకు వెళ్లి నీ  గురించి ,  నీ అందచందాల గురించి  చెప్పి ......నీ మీద అనురాగం కలిగేలా చేస్తాను " అని పలికింది . ఆ హంస పలుకులు విని నలుడు ఆనంద పడి దానిని విడిచిపెట్టాడు . ఇచ్చిన మాట ప్రకారము ఆ హంస
విదర్భ దేశానికి ఎగిరిపాయింది .అంతఃపురం ముందు  విహరిస్తున్న హంసను చూసి దమయంతి ముచ్చట  పడింది.
చెలి కత్తెల  సాయంతో  దమయంతి  ఆ హంసను పట్టుకుంది .  ఆ హంస దమయంతి తో "దమయంతీ! నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను . నలుడు సౌoదర్యవంతుడు ,సంపన్నుడు , సద్గుణ వంతుడు. నివు సౌoదర్యములో , గుణంలో  అతనికి తగిన  దానివి . అతనికి  భార్యవైతేనే నీ కు రాణింపు " అని పలికింది. దమయంతి "ఓ హంసా ! నలుని గురించి నాకు  ఎలా చెప్పవో  అలాగే నలునికి ఆ గురించి చెప్పు " అన్నది. ఆ హంస అలాగే చేసింది . ఇలా ఎలువురికి ఒకరిపై  ఒకరికి అనురాగం అధికమైంది.
దమయంతి స్వయంవరం...నల దమయంతుల వివాహం
నల దమయంతుల ప్రణయ విషయం దమయంతి చేలికత్తే ల ద్వార తెలుసుకున్న భీమ మహారాజు  కుమార్తె కు స్వయంవరం ప్రకటించాడు.
 ఆహ్హ్వానాన్నoదుకున్న  రాజులంతా స్వయంవరానికి విచ్చేశారు .నలుడు కూడా స్వయంవరానికి పోతున్నాడు. ఇంద్రుడికిదమయంతి స్వయంవర విశేషం తెలిసి దిక్పాలకులతో స్వయంవరానికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో నలుని చుసిన ఇంద్రుడు నలునితో “నిషాద రాజా! నీవు నాకు దూతగా పని చేయాలి “ అన్నాడు.నలుడు ‘అలాగే చేస్తాను.ఇంతకి మీరు ఎవరు ?
నేను నీ కేమి చేయాలి ?” అని అడిగాడు.ఇంద్రుడు నలునితో “నేను ఇంద్రుడను .వీరు దిక్పాలకులు . నీవు పోయి దమయంతికి మా గురించి చెప్పి ....ఆమె మమ్ములను వరించేలా చేయాలి “ అన్నాడు. నలుడు ఇంద్రునితో “అయ్యా!నీకిది  ధర్మమా?నేను కూడా అదే పని మీద పోతున్నాను కదా” లుడు దమయంతిని మొదటిసారిగా చూసి మాటిచ్చావు  కనుక,ఈ కార్యం చేయవలసిందే .ఇది  దేవతాకార్యం , నీవు చేయగలవు.
మా మహిమ చేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకు ఎవరు  అడ్డు చెప్పారు “ అన్నాడు .
గత్యంతరం  లేక, నలుడు  దమయంతి అంతఃపురములో ప్రవేశించాడు .న, ‘హంస చెప్పిన దాని కంటే  దమయంతి  సౌoదర్యవతి’ ఆమె చేలి కత్తేలు నలుడుని  చూసి  ఆచర్యపోయారు . దమయంతి నలుని చూసి “మహాత్మా  మీ రెవరు ? ఎక్కడి నుండి వచ్చారు?  ఈ అంతఃపురములో ఎవరికి కనపడకుండా ఎలా ప్రవేశించారు ? “ అని అడిగింది .నలుడు దమయంతి తొ “నా పేరు నలుడు .నేను దేవదుతగా వచ్చాను . దిక్పాలకులు,వారిలో ఒకరిని వరించమని నీకు  చెప్పమని నన్ను పంపారు “అన్నాడు నలుని మాటలకూ ఆమె మనసు కష్టపడింది. “అయ్యా!నేను మానవకాంతను .నమస్కరించ వలసిన దేవతలను వరించడం ధర్మమా ?నాడు హంస చెప్పినది మొదలు , నిన్నే నా భర్త గా తలచుకుంటున్నాను . నా తండ్రి భీమ రాజు  మిమ్ము ఇక్కడికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించారు . మీరే నా భర్త ,కనుక నన్ను స్వికరించండి .లేకుంటే నా ప్రాణాలను తీసుకుంటాను కాని ,ఇతరులను వరించను . “ అని దమయంతి  ప్రార్దించింది. నలుడు దమయంతి తో “ దమయంతి ! దేవతలు ఐశ్వర్యవంతులు , జరా మరణాలు లేని వారు,  వారిని కాదని జరామరనాలకుఆలవాలమైన  నన్ను కోరడం న్యాయమా ? అని అన్నాడు.ఆ మాటలు విని దమయంతి  దుఃఖించింది. ఆమె నలునితో “నేను ఒక ఉపాయం చెప్తాను . అందరికి ముందు నేను దేవతలను ప్రార్ధించి  నిన్ను వివాహమాడతాను. అప్పుడు మీకు దేవతల మాట వినలెదన్న దోషం వుండదు “ అన్నది. ఆ మాటలు నలుడు ఇంద్రుడికి  చెప్పాడు . అది విని దిక్పాలకులు “దమయంతి మమ్మల్ని  ఎలా వారించదో చూస్తాము .” అని అందరూ నలుని రూపములో  స్వయంవరానికి వచ్చారు . “స్వయంవరమండపములో  ఒకేసారి ఐదుగురు నలులు కనిపించారు . దమయంతి వరమాల పట్టుకుని వచ్చింది . మనస్స్సులో ధ్యానించి “దేవతలారా ! నలుని గుర్తు పట్టడంలో  నాకు సహకరించండి .మీ నిజరుపలతో ప్రత్యక్షం అవండి” అని ప్రార్ధించింది. వారు దమయంతి ని కరుణించి తమ నిజరుపాలతో ప్రతక్షం అయ్యారు . నలదంపతులకు వై భవోపేతంగా వివాహం జరిగింది .
ఇంద్రాది దేఅవతలు అనేక వరాలు ఇచ్చి అనుగ్రహించారు . నలదమయన్తులపై కలిప్రభావం ...రాజ్యాన్ని కోల్పోయి అడవులకు వెళుతున్న నలుడు .
దమయంతి స్వరం వరం చూసి దేవలోకం వెళుతుండగా , దేవతలకు క లి పురుషుడు కనిపించాడు. ఇంద్రుడు కలి పురుషుడుని చూసి” ఎక్కడికి పోతున్నావు?” అని అడిగాడు. “భూలోకములో జరుగుతున్న దమయంతి స్వయంవరానికి పోతున్నాను “అన్నాడు .అ మాటలకూ వారు నవ్వి “దమయంతి స్వయంవరం జరిగింది . ఆమె నలుని వివాహం మాడింది .”అన్నారు. కలికి కోపం వచ్చింది .నలుని రాజ్యభ్రష్టుని చేసి వారిరువురికి  విఎగం కల్పించాలి  అనుకున్నాడు.నలుడు ధర్మతుడు , కలి ప్రవేశానికి
చాలా కాలానికి గాని అవకాసం రాలేదు. ఒకరోజు  నలుడు మూత్ర  విసర్జన  చేసి పాదప్రక్షాళన చేయకుండా సంద్యావందనం   చేసాడు. ఆ అశౌచాన్ని ఆధారం చేసుకుని కలి అతనిలో ప్రవేశించాడు. నలుని దాయాది  అయిన పుష్క రుని  వద్ద్దకు వెళ్లి నలుని జూదవ్యసనం వుందని అతనితో జూదమాది అతని రాజ్యాన్ని గెలువవచ్చని నమ్మబలికాడు .బ్రాహ్మణ వేషంలో  పుష్కరునితో నలుని వద్దకు వెళ్లి జూదానికి  ఆవ్హానించాడు . జూదానికి పిలిస్తే  పోకపోవడం ధర్మం  కాదని, నలుడు జూదమాడటానికి  అంగీకరించాడు . జూదం మొదలుయింది . నలుడు తన రాజ్యాన్ని ,సంపదలను వరుసగా పోగొట్టుకున్నాడు...అయినా ఆడటం
మానక  సమస్తం పోయే వరకు ఆడాడు . దమయంతి దుఃఖింఛి “ఓడేకొద్ది గెలవాలని పంతం పెరుగుతుంది.ఏమి చెయ్యలేము” అని సరిపెట్టుకుంది . పుష్కరుడు గెలవడం , నలుడు  ఓడటం  తధ్యమని గ్రహించిన దమయంతి తన కుమార్తె ఇంద్రను,
కుమారుడు ఇంద్రసేనను సారథిని తోడిచ్చి  విదర్భలో  వున్నా తండ్రి వద్ద్దకు పంపింది. నలుడు తన రాజ్యాన్ని కోల్పోయి,నగరం వెలుపల మూడు రోజులు వున్నాడు . జూదములో సర్వం పోగొట్టుకున్న నలుని చూడటానికి ఎవరు రాలేదు. ఆకలికి తట్టుకోలేకపోయాడు . ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పట్టడానికి తన పై వస్త్రాన్ని వాటి మిద విసిరాడు . ఆ పక్షులు ఆ వస్త్రాoతో సహా  ఎగిరిపోయాయి .నలుడు ఖేదపడి  తన భార్య కొంగు  పై వ స్త్రాo గా  కప్పుకున్నాడు .  ఆ దుస్థితి  తట్టుకోలేని నలుడు “దమయంతి! ఇక్కడ నాలుగు మార్గాలు వున్నాయి .ఇది , నీ పుట్టిల్లు  విదర్భ దేశానికి  పోయే మార్గం , ఇది కోసల దేశానికీ పోయి మార్గం , ఇది దక్షిణ దేశాని కి పోయి మార్గం , ఇది ఉజ్జయినికి పోయి మార్గం. వీటిలో మనకు అనుకులమయిన  మార్గమేదో  చెప్పు.  నీవు అడవు
లలో కష్టాలు పడలేవు , నీ తండ్రి ఇంటికి వెళ్లి సుఖంగా వుండు “ అని చెప్పాడు. “ అవునా నాధ, మనం విదర్బ కు  వెళ్లి  సుఖంగా వుంటాము “ అని చెప్పింది. నలుడు “దమయంతి ! మహారాజుగా  విదర్భలో  తిరిగిన వాడిని ,రాజ్యబ్రష్టునిగా ఎలా రాగాలను చెప్పు. అన్ని రోగాలకన్నా  పెద్ద రోగం  దుఃఖం ....అందుకు భార్య పక్కన వుండటం పరమౌషదం . అందుకని నీవు పక్కన వుంటే, ఎన్ని కష్టాలయిన  సుఖాలుగానే  వుంటాయి” అన్నాడు నలుడు. దమయంతి “నిజమే అందుకనే నన్ను ఎప్పుడు మీ వెంట ఉండటానికి అనుమతించండి “ అన్నది. అందుకు నలుడు అంగీకరించాడు. నలదమయంతుల  వియోగం
ఒకరోజు అడవిలో నలుని తోదమిడ తల పెట్టుకుని , దమయంతి నిద్రపోతూవుంది. ఆమెను చూసి నలుడు “ఈ సుకుమారి నాతో అడవులలో  కష్టాలు పడుతోంది  నా వెంట ఉండటమే  ఈమీ కష్టాలకు కారణము .నేను లేకపోతే ఈమీ పుట్టింటికి వెళ్లి సుఖపడుతుంది “ అని మనసులో అనుకుని ,తను ధరించిన  చీర  భాగాన్ని  చింపి పైన వేసుకుని ఆమెను వదలలేక వదలలేక విడిచి వెళ్ళాడు. నిద్రలేచిన దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖించింది . భర్తను తలచుకుంటూ అడవిలో తిర్రుగుతున్న
దమంతిని ఒక కొండచిలువ పట్టుకుంది. భయంతో దమయంతి కేకలు వేసింది . ఆ కేకలు విఇని ఒక కిరాతకుడు తన కత్తి తో ఆ కొండచిలువను చంపి ,దమయంతిని రక్షించాడు. ఆ కిరాతకుడు  దమయండి గురించి తెలుసుకున్నాడు . ఆమె నిస్సహాయతను
తెలుసుకుని ,ఆమెను తకబోవగా, దమయంతి  అతనిని భస్మం  చేసింది. భర్తను తలచుకుంటూ అడవిలో దారితెన్ను లేకుండా , ఆమెకు ఒక మునిపల్లె కనపడింది.అక్కడ ఆమె మునిశ్రేష్ఠులను చూసింది. మునులు దమయంతి  ని చూసి “అమ్మా ! నీవు ఎవరు?ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు ? అని అడిగారు . సమాధానముగా దమయంతి “మునిపున్గావులారా !నేను నల చక్రవర్తి భార్యను .నా పేరు దమయంతి .  విధి వశంతో నా భర్త నన్ను విడిచి వెళ్ళాడు . నాకు వారి జాడ చెప్పగలరా ? నేను భర్త లేనిదే  జీవించలేను “అని అడిగింది . మునులు “అమ్మా ! నీకు త్వరలోనే  భర్త సమాగమం జరుగుతుంది . చింత పడకు “
అని చెప్పి , వెళ్లారు. దమయంతి పిచ్చి దానిలా  భర్తను వెతుక్కుంటూ  ఆ అడవిలో తిరుగుతూ వుంది. ఇంతలో అటుగా పోతున్న బాటసారులు ఆమెను చూసారు . కొందరు ఆమెకు మొక్కారు .వారిలో వున్నా వ్యాపారి ఆమెను గురించి తెలుసుకుని “అమ్మ! నేను నలుని చూడలేదు, కాని మేము  చేదిదేశానికి  వేలుతున్నము “అన్నాడు .దమయంతి వారితో “నేను కూడా మీ వెంట వస్తాను “అన్నది. ఆ వ్య పారి ఆమెను తమ వెంట తీసుకు వెళ్ళాడు. వారు అడవి మర్గ్రములో రాత్రి  వేల నిద్రిస్తున్న సమయంలో ఒక ఏనుగుల గుంపు వారిలో చాలా మందిని తొక్కేసింది. వారిలో చాలా మంది మరణించడం చూసి, దమయంతి త దురదృష్టానికి  దుఃఖించింది తనను చంపలేదని రోదిస్తున్న ఆమెను కొందరు బ్రాహ్మణులు ఓడార్చి  ఆమెను తమ వెంట సుబాహు
నగరానికి తీసుకు వెళ్లారు .ఛేదిదేశ రాజధాని  సుభాహు పురము చేరింది. ఒళ్ళంతా దుమ్ముతో వీధిలో వెళుతున్న దమయంతి ని
రాజమాత చూసి  దాసిలను పంపి దమయంతిని  అంతఃపురానికి పిలిచింది. రాజమాత  దమయంతితో  “అమ్మా !నిన్ని చూస్తుంటే రాచకళ వుట్టి పడుతుంది . నివు ఎవరు?” అని అడిగింది . దమయంతి “అమ్మా !నా భర్త జూదంలో  రయం పోగొట్టుకున్నాడు.నన్ను అడవిలోలో ఒంటరిగా విడిచి వెళ్ళాడు .అతనిని వెతుకుతూ తిరుగుతున్నాను “ అని చెప్పింది .రాజ మాత “అమ్మ! ఇక నుండి నువ్వు నా దగ్గర  సైరంద్రిగా వుండు.నీకు ఏలోటు రాకుండా నేను చుస్తాను .నీ భర్తను వెతికిస్తాను “ అని చెప్పింది .దమయంతి అందుకు అంగీకరించి అలాగే వుంటాను,కానీ నేను సైరంద్రిగా ఎవరి ఎంగిలి తినను ,పరులకు కాళ్ళుపట్టను , పరపురుషులతో మాట్లాడను . కేవలం నా భర్తను వెతుకుతు వెళ్ళే బ్రాహ్మణులతో మాత్రము మాట్లాడుతాను . అని చెప్పింది.
రాజమాత అంగికరించి తన కుమార్తెను సునంద వద్దకు పంపింది .దమయంతి అక్కడే వున్దిపాయింది . 

నలుడు వికృతరుపుడగుట                                                            

దమయంతి ని వదిలి వెళ్ళిన నలుడు  అడవిలో ప్రయాణిస్తుండగా , అడవి అంతతా దావానలం వ్యాపించింది. ఆ మంటల మధ్యనుండి “రక్షించండి రక్షించండి “ అన్న ఆర్తనాదం వినిపించింది . ఆ ఆర్తనాదం విని నలుడు అగ్ని కీలలనడుమ వున్న నాగ కుమారుని రక్షించాడు . ఆ పాము నలుని కాటు వేసింది . పాము కాటుకు నలుడు వికృ తరుపుడయ్యాడు. అప్పుడు ఆ పాము తన నిజరూపముతో ప్రత్యక్షం అయి నలునితో “నలమహారాజ !నా పేరు కర్కోటకుడు నేను నిన్ను కాటు వేశానని భయపడకు .ఇక నిన్ను ఎవరు గుర్తించారు .పాము కాటు నిన్ను ఏమి చెయ్యదు . నీ రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది , ని భార్య నీకు దక్కుతుంది,
నీకు ఎప్పుడు నిజరూపం కావాలన్నా ,నన్ను తలచుకుంటే ని వద్దకు ఒక వస్త్రం ఎగురుతువస్తుంది .దానిని కప్పుకుంటే నీ పుర్వకృతి వస్తుంది. నీకు మరొక విషయం చెప్తాను . ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశస్థుడైన రుతుపర్ణుని రాజ్యం వుంది .నివు అక్కడికి వెళ్ళు . బాహుకుడు అనేపేరుతో అతని వద్ద  రధసారధిగా  చేరు. నివు అతనికి అశ్వహృదయం అనే విద్యను ఇచ్చి
అతనిని నుండి అక్షహృదయం అనే విద్యను గ్రహించు “, అని చెప్పి కర్కోటకుడు వెళ్ళాడు . ఎక్కడ వున్నా నలుడు ఎప్పుడూ
దమయంతిని తలచి దుఃఖిస్తూ ఉండేవాడు .ఒకరోజు నలుడు దమయంతిని తలచుకొని దుఃఖిస్తూ వుండగా  జీవలుడు  విని ఈ విక్రుతరూపి ప్రియురాలు  ఎంత విక్రుతరుపంతో వుంటుందో అనుకుంటూ నలుని దగ్గరకు వచ్చి ,విషయం ఏమిటని అడిగాడు.’
 అందుకు నలుడు జీవలునితో “ అయ్యా నాకు ఒక ప్రేయసి కూడానా నాకు తెలిసిన సైనికుడు తన ప్రేయసిని గురించి దుఃఖిస్తుండగా చూసాను .  అతనిని అనుసరిస్తూ ఏడుస్తున్నాను “ అన్నాడు.
  
 దమయంతి విధర్భాదేశానికి చేరుట

 విదర్భ దేశంలో వున్నా భీమునికి నలుని విషయాలు తెలిసాయి తన కూతురు , అల్లుడు ఏమయ్యారో అని పరితపించాడు  వారిని వెతకడానికి  నలువైపులా బ్రాహ్మణులను పంపించాడు . ఎన్నో బహుమానాలు ప్రకటించాడు . ఛేదిదేశం  చేరిన బ్రాహ్మణుడు ,దమయంతి నుదుటన వున్నా పుట్టుమచ్చ ను చూసి ఆమెను  గుర్తించాడు.తాడు దమయంతితో “అమ్మ ! నేను ని తనది వద్ద నుండి వస్తున్నాను .అక్కడివారంత క్షీమం.నేను  నీ సోదరుని  మిత్రుడను “ అనగానే దమయంతి వారిని తలచుకొని   పెద్దగా రోదించింది .అది చుసిన రాజమాత ఆ బ్రాహ్మణుని చూసి “ బ్రాహ్మణోత్తమ ! ఈ మీ ఎవరి భార్య ? ఎవరి కూతురు? ఇలా వుండటానికి  కారణం ఏమిటి ?” అని అడిగింది .అందుకు అతడు “ అమ్మా !ఈమె విదర్భ రాజు కుమార్తె .నలచాక్రవర్తి భార్య . ఈ మే పేరు దమయంతి .అతడు విధి  వాశాత్తు రాజ్యా న్ని పోగొట్టుకొని  అడవుల పాలయ్యాడు . భీముని ఆజ్హ్న ఐ ఈ మెను వెతుకుతూ  ఇక్కడికి వచ్చి ఈ మెను గుర్తించాను.” అన్నాడు. అది విని దమయంతి కౌగాలించుకున్న రాజమాత “దమయంతి !నీఉ నాకు పుత్రికా  సమానురాలివి. నేను , నీ తల్లి  దశార్ణరాజు కుమార్తేలము . నీతల్లి  విదర్భ రాజు ను విహహ మాడింది .నేను విరబ రహును వివాహమాడాను” అన్నది .అందుకు అందరు ఆనందపడ్డారు . దమయంతి బ్రాహ్మణునితో పుట్టింటికి ప్రయాణం అయింది.


దమయంతికి  ద్వితీయ స్వయంవరం ప్రకటించుట

రాజ సౌధంలో వున్నా దమయంతి  భర్తృవియోగంతో  భాదపడుతునే వుంది .ఆమె తన తండ్రితో “ నా భర్తను తక్షణం  వెతికించండి  ఆ యన లేకుండా నేను బ్రతకలేను  “ అన్నది. భీముడు వెంటనే బ్రాహ్మణులను పిలిచి నలుని వెతకమని చెప్పాడు.  వారితో దమయంతి ఇలా చెప్పింది .”నా భర్త ఇప్పుడు  రాజ్యబ్రష్టుడు కనుక ,మారువేషంలో వుంటాడు .మీరు వెళ్ళిన రాజ్య సభలలో ఈ విధముగా ప్రకటించండి “ నీవు సత్యసండుడవు కాని, నీ సతిని  వచించావు ఆమె సగం వస్త్రం ధరించి వెళ్ళవు. అలా చెయ్యడం ధర్మమా ? నాపై కరుణ చూపు” అని చెప్పండి. ఈ మాటలకూ ఎవరయినా రోశపడి  బదులిస్తే ,నా వద్దకు వచ్చి చెప్పండి ? అన్నది. అలా నలుని వెదకడానికి వెళ్లినవారంతా నలుని జడ తెలుపకపోయిన ,వారిలో పర్ణాదుడు అనే విప్రుడు దమయంతితో “అమ్మ ! నేను ఋతు పర్ణునిరాజ్యములో  నీఉ చెప్పినట్లే చేప్పాను ఒక కురూపి  వంటవాడు. సారది అయిన బాహుకుడు అనేవాడు నన్ను రహస్యముగా కలుసుకొని అయ్యా ! భర్త కష్టాలలో వున్నా సహించి ,ఆదరించే భార్య ఇహ లోకంలోనూ పరలోకములోను సుఖపడుతుంది అన్నాడు అని దమయంతి తొ చెప్పాడు . దమయంతి ఆలోచించగా అతడు నలుడు కాకపోతే అల ఎందుకు బడులిస్తడు అనుకుంది. తన అనుమానము ద్రుడపరచుకోవడానికి తల్లి అనుమతితో సుదేవడనే బ్రాహ్మణుని పిలిపించింది  సుదేవ నీవు ఋతుపర్ణునిరాజుతో  రాజా భీముడు తన అల్లుని కొరకు వెతికించిన ఫలితం లేదు కనుక ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. భూమండలంలోని రాజులు  అందరు వస్తున్నారు . మరునాడే స్వయంవరం కనుక వెంటనే బయలుదేరు  అని చెప్పు అని చెప్పి పంపింది.  సుదేవుడు  ఋతుపర్ణునితో దమయంతో చెప్పినట్లే చెప్పాడు .


నలుడు స్వయంవరానికి బయలుదేరుట

దమయంతి బ్రాహ్మణుని ద్వారపంపిన  సందేశం విఇని ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్ళాలని అనుకున్నాడు .ఒకరోజులో విదర్భ ను చేరటం ఎలా ? అనుకుని సారది అయిన బహుకుని పిలిచి బాహుకా ! దమయంతి స్వితియస్వయంవరం ప్రకటించారు .నాకు చూడాలని వుంది. ఒక్కరోజులో విదర్భకు వెళ్ళాలి . నీ ఆశ్వసామద్యం ప్రకటించు  అన్నాడు . సరే అని చెప్పినా బాహుకుడు మనస్సు కలతకు గురైoది. నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టి కదా , దమయంతి ర్రెండవ స్వయంవరం ప్రకటించింది .అవివేకులయిన పురుషులు తాము ఏమి చేసినా భార్యప్రేమిస్తుందని అనుకుంటారు  కాని అది నిజం కాదు. నా మిద కలిగిన కోపంతో దమయంతి ఇలా చేసింది అని దుఃఖించాడు .అయిన దమయంతి పతివ్రత. ఇద్దరు పిల్లల తల్లి  ఈ విధముగా రెండవ పెళ్లి చేసుకుంటుందా ? ఏమో ? ఆవింత చుస్తాను అని మనసులో అనుకున్నాడు . వెంటనే రధానికి గుర్రాలు కట్టి విదర్భకు ఋతుపర్ణుని తీసుకుని ప్రయాణం అయ్యాడు . రుతుపర్ణుని రధం పోయే వేగం చూస్తుంటే అది సూర్యుని  రాధంలా , బాహుకుడు
అనూరిడిలా అనిపించింది. పక్కనే  వున్నా వార్ష్నేయుడికి  అదే సందేహం కలిగింది.భూలోకములో  నలునికి మాత్రమీ  ఇలాంటి నైపుణ్యం వుంది , కాని ఈ కురూపి నలుడు ఎలా అవుతాడు అని మనసులో అనుకున్నాడు .ఇంతలో ఋతుపర్ణుని  ఉత్తరీయం జారి, కింద పడింది బాహుకా రధం ఆపు , వార్ష్ణేయడు దిగి  ఉత్తరీయం తీసుకు వస్తాడు”అన్నాడు .బాహుకుడు “మహారాజ ! మనం ఆమడ దూరం వచ్చేసాం .అంతదూరం నడచుకుంటూ ఎలా తిసుకురాగలాడు?అన్నాడు .అతని రథ సారధ్యానికి ఋతుపర్ణుడు
ఆశ్చర్యచకితుడయ్యాడు . తన పరిజ్ఞానాన్ని బాహుకునికి చూపించాలన్న ఆసక్తి కలిగింది . అంతలో రధం ఒక వృక్షాన్ని దాటింది
ఋతుపర్ణుడు బాహుకునితో “బాహుకా ఆ వృక్షంలో ఎన్ని కాయలు ,ఎన్ని పూలు ఎన్ని ఆకులు వున్నాయో నేను చెప్పగలను “అని అన్నాడు . బాహుకుడు “చెప్పండి మహారాజా అని అడిగాడు. ఋతుపర్ణుడు చెప్పాడు లెక్కించి చూస్తే కాని నమ్మను అని రధం ఆపి ఆ చెట్టుని పడగొట్టించి లెక్కించారు . ఋతుపర్ణుడు చెప్పిన లెక్క కచ్చితంగా  సరిపాయింది . బాగుకుడు ఆచార్యపడి
ఆ విద్యను తనకి ఉపదేసించమని అడిగాడు. ఋతుపర్ణుడు బాహుకా ఇది అక్షవిద్య  అనే సంఖ్యశ్రాస్త్రం అన్నాడు .అప్పుడు బాహుకుడు మహారాజా!ఇందుకు ప్రతిగా నేను నీకు అశ్వహృదయం అనే విద్యను నేర్పుతాను .అన్నాడు. ఋతుపర్ణుడు ఇప్పుడు కాదు తరువాత అడిగి నేర్చుకుంటాను అన్నాడు  అక్షహృదయ  విద్య మహిమ వలన నలునిలో నుండి కలి వెలుపలికి వచ్చాడు. తనను క్షమించమని నలుని వేడుకున్నాడు .నలుడు ఆగ్రహించి  శపించబోయాడు. కలి నలునితో నలమహారాజా నిన్ను  ఆవహించి నీలో వున్న సమయంలో నిన్ను కర్కోటకుడు  కాతువేయడం వలన అనుక్షణం కాలి పోయాను, ఇంతకంటే శాపం ఏవుంది , నన్ను క్షమించి విడిచి పెట్టు  అని వేడుకున్నాడు . నలుని రధం  విపరీతమైన ఘోషతో విదర్భలో ప్రవేశించింది .ఆ ఘోష విని దమయంతి అది నలుని రథం అని గుర్తుపెట్టింది . కాని రధంలో ఋతుపర్ణుని చూసి నిరాశ చెందింది .భీముడు ఎంతో ఆనందముతో ఋతుపర్ణుడు ఆవ్హానించి విడిది చూపాడు . ఋతుపర్ణునికి విదర్భలో స్వయంవరం  జరుగుతున్న సందడి కనిపించలేదు . బాహుకుడు రధాన్ని ఆశ్వశాలలో  నిలిపి  సేధతిరాడు.


కలుసుకున్న నలదమయంతులు

దమయతి తన దాసితో వచ్చింది ఋతుపర్ణ మహారాజు  అతని సారది వార్ష్నేయుడు వారు నాకు తెలుసు ,కాని వారి వెంట వున్నా కురుపు ఎవరు ? అతన్ని చూసి నా మనసు పరవసిన్చిపోతుంది . అతని వివరాలు తెలుసుకుని రా అని పంపింది .దాసీ నలుని వద్దకు వచ్చి “ అయ్యా ! రాకుమారి మీ యోగ  క్షేమాలు కనుక్కుని రమ్మంది . అని చెప్పింది .నలుడు మీ రాజకుమారి స్వయంవరం ప్రకటించింది కదా  దానికి నేను మా మహారాజును ఒక్క రోజులో నూరు ఆమడల దూరం  ప్రయాణించి తీసుకు వచ్చాను . అని చెప్పు అన్నాడు. మీతో వచ్చిన మూడవ వ్యక్తి ఎవరు ? అని దాసీ అడిగింది . నలుడు అతడు వార్ష్నేయుడు . ఇంతకు ముందు నలుని సారధి అన్నాడు. దాసీ అతనికి నలుని జాడ తెలుసు కదా ? అని అడిగింది . నలుడు దాసి తొ తన  రాజ్యాన్ని పోగొట్టుకునేముందు నలుడు తన పిల్లలని ఇచ్చి  వర్ష్నేయుడు యుని విదర్భకు పంపాడు .ఆ తరువాత వర్ష్నేయుడు ఋతుపర్ణుని వద్ద సారధిగా చేరాడు. నలుని గురించి నలునికే తెలియాలి , లేదా అతని భార్యకి తెలియాలి , వేరొకరికి తెలిసే అవకాశం లేదు . అన్నాడు. బాగుకుడు దాసీ అయ్యా నలుడు తనను ప్రాణపదం  గా చూసుకునే భార్యను నిర్దాక్షిణ్యంగా అడవిలో విడిచి వెళ్ళాడు .దమయంతి నలుని విడిచి వెళ్ళిన సగం చీర ధరించి కాలం గడుపుతోంది . ఆమెను ఇలా విడిచి వెళ్ళడం ధర్మమా ? అని అడిగింది. నలుని కంట నీరు పెల్లుబికింది .అది దాసికి తెలియ కూడదు అని మోహము తిప్పుకున్నాడు . దమయంతికి దాసి జరిగిందంతా వివరించింది. దమయంతి దాసితో సందేశం లేదు అతడు నలుడే . అయిన ఈ వికృత రూపం ఏమిటి ? అతను వంటవాడు అని చెప్పారు . కనుక, వంట ఎలా చేస్తాడో పరీక్షించు అని పంపింది. దాసీ వెళ్లి నలుని నిశితంగా పరిశీలించి అమ్మా అతడు సామాన్యుడు కాదు. అతడు ఏ పని అయినా సునాయాసనముగా  చేస్తున్నాడు. అతడు గడ్డిని విదిలిస్తే మంటలు వస్తున్నాయి. వంట పూర్తి అయ్యే వరకు అల మండుతున్నాయి . వంటలు అద్భుతముగా వున్నాయి  అని దమయంతికి చెప్పింది .  దమయంతి నలుడు వండిన వంటలు తెప్పించి రుచి చూసి  సందేహం లేదు , ఇవి నలుని వంటలే అని గ్రహించి దాసితో త పిల్లలను నలుని వద్దకు పంపింది. నలుడు వారిని చూసి చలించి  ఎత్తుకుని ముద్దాడాడు . దాసితో అమ్మ ఏమి అనుకోవద్దు . వీరిని చూస్తే నా బిడ్డలు గుర్తుకు వచ్చారు  అందుకే అల చేశాను .ఇక నువ్వు నా వద్దకు రావద్దు. ఎవరయినా చూస్తే ఏదయినా అనుకుంటారు. అయిన మేము విదేశాలనుండి వచ్చిన అథిదులము .మాతో నీకేం పని ?అన్నాడు. ఇది విని దమయంతి సంతోషపడి తన తల్లి వద్ద్దకు వెళ్లి ఋతుపర్ణుని సారధి గా వచ్చిన  కురూపి బాహుకుడే నలుడు. అమ్మ అతడు ఇక్కడకు  వస్తాడాన్నేను అక్కడికి వెళ్ళాలా నువ్వే నిర్ణయించు అని అడిగింది .భీమరాజు అనుమతితో ఆమె బాహికుడిని దమయంతి వద్దకు రప్పించింది . దమయంతి  నలుని చూసి, అయ్యా నిస్సహా యంగా వున్నా నన్ను  నా భర్త నలమహారాజు నట్టడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళాడు. అలా  అలా సంతననైన నన్ను విడిచి  పెట్టడం ధర్మమా ? అలా  చేయడానికి నేనేమి అపకారం  చేసాను . అగ్ని సాక్షిగా విడువను అని నాకు ప్రమాణము చేసిన భర్త అలా చేయవచ్చా ? అని దుఃఖించింది.నలుడు “సాధ్వి! ఆ సమయంలో నన్ను కలి ఆహహించి వున్నాడు . అందువలన నేను అలా చేసాను. జూదములో సర్వం పోగొట్టుకొని భాదలు పడుతున్న నేను ,నాతోపాటు భాదలు పడుతున్న నీ భాదను సహించలేక , నిన్ను విడిచి వెళ్ళాను. అలా చేస్తే నువ్వయిన నీ తండ్రి ఇంటికి వెళ్లి సుఖంగా ఉంటావు అని అలా చేశాను .  నీపై అనురాగముతో మిమ్మల్ని చూడటానికే  నేను ఇక్కడికి వచ్చాను . మరొక భర్తకోసం స్వయంవరం ప్రకటించడం కులస్త్రిలకు  తగునా అలా ఎందుకు చేసావు ? అందుకే కదా ఋతుపర్ణుడు వచ్చాడు .ఇది ధర్మమా ? అని దమయంతిని అడిగాడు . దమయంతి “నాధానేను మీ కోసం గాలిస్తూ పంపిన విప్రులలో అయోధ్యకు వెళ్ళిన విప్రుడు మిమ్మలను గుర్తించాడు .మిమ్మల్ని రాప్పించుతకే ఇలా చేశాను. మీరు కాక ఇంకెవ్వరు నూరు యోజమలు దూరం ఒక్క రోజులో ప్రయనించగలరు ?నాలో ఎటువంటి పాపపుతలపు లేదు అని మీ పాదములు అంటి నమస్కరించి  ప్రమాణం చేస్తున్నాను” అని దమయంతి నలుని పాదాలకు నమస్కరించింది. వెంటనే ఆకాశం నుండి వాయుదేవుడు “నలచాక్రవర్తి ! ఈమీ పవిత్రురాలు ,పతివ్రత,నేను,సూర్యుడు,చంద్రుడు,ఈమీ సౌశీల్యం కాపాడుతున్నాము” అని పలికాడు. నలుడు కర్కోతకుడిని స్మరించాడు . వెంటనే ఒక వస్త్రం వచ్చింది.  అది ధరించాగానే నలునికి ఇంద్రతేజ్జస్సు తొ  సమానమైన మనోహరమైన పుర్వరుపం వచ్చింది . దమయంతిని పరిగ్రహించాడు .


నలదమయంతులు రాజ్యాన్ని పొందుట.

సభలో  నల దమయంతులు
నలుడు విదర్భ లో  ఒక మాసము వుంది, తన రాజధానికి వెళ్లి పుస్కరుని కలిసాడు.నలుడు పుస్కరునితో  పుస్కరా జుదమడటం నీకు ప్రియం కదా. నేను నా భార్య దమయంతిని ఫణంగా పెడతాను. నీవు  నీ  సర్వస్వం  పెట్టి నాతో ఆడతావా? లేదా నాతో యుద్ధం చేయి .ఎవరు గెలిస్తే వారిదే రాజ్యం . నీకేది ఇష్టమో నిర్ణయించుకో అన్నాడు. పుష్కరుడు జూద ప్రియుడు పైగా ఒకసారి  జూదమాది గెలిచాడు .కనుక అతడు నలునితో నేను జూదమీ ఆడతాను  అన్నాడు. నలుడు పుస్కరునితో  జూదమది రాజ్యాన్ని గెలుచుకున్నాడు. పుస్కరునితో పుస్కరా , నేను ఇదివరకు  నీ తొ జూదమాడినప్పుడు  నన్ను కలి ఆవహించి వున్నాడు.కనుక ఓడిపోయాను . నీ బలం వలన కాదు . నీవు నా పిన తండ్రి కుమారుడివి కనుక, నిన్ను ఏమి చేయను వెళ్ళు. అని చెప్పి పంపాడు.

ఫలశ్రుతి:   

ఈ నలుడి గాఢ శ్రద్ధ తొ వినేవాడు, సమావేశాలలో చదివి  వినిపించేవారు, కలి వలన సంభవించే దోశాలనుంది విముక్తి చెదగలరు .సర్వ  పుణ్యకార్యాలు చేసినప్పుడు లభించే పున్యఫలితలు నలోపాఖ్యానం విన్న వారికి, వినిపించిన వారికీ కుడా లభిస్తాయి. అటువంటి వారికి బహుపుత్ర లాభం, పౌత్రవృద్ధి ,ఆయురారోగ్య ధనసంపత్తులు  కలుగుతాయి విషప్రయోగం నుండి భాదలు , చెడు విషయాలలోని లంపతత్వo వారిని అంటావు . వారు ధర్మాత్ములు కాగలరు . కర్కోతకస్య  నాగస్య దమయంత్య నలస్య చ  ఋతుపర్ణశ్చ రాజర్షే కీర్తనం కలినశనo కర్కోతకుడుడనే నాగుడిని, దమయంతిని పుణ్యశ్లోకు డైన నలుని , ఋజుచరితుడైన ఋతుపర్ణుని  ధ్యానించి   కీర్తించిన , కలి భయాలు తొలగ గలవు......



Comments

Post a Comment

thanks for your comment